మహేష్ డైరెక్టర్ ఎలాంటి వెబ్ సిరీస్ చేస్తాడో ?
‘మహర్షి’తో డైరెక్టర్ వంశీ పైడిపల్లికి సూపర్ హిట్ రావడంతో ఆయన తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే మొదట వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసారు. ఈ లోపు పరుశురామ్ తో సర్కారు వారి పాట అంటూ మహేష్ సినిమా మొదలెట్టేసాడు. దాంతో వంశీ మిగిలిన స్టార్ హీరోలకు కథ చెబుతూ సినిమాని సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ జనవరి నుండి వెబ్ సిరీస్ మొదలుపెట్టబోతునట్లు తెలుస్తోంది.
- Advertisement -
అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్ను రూపొందించడానికి చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి చేత వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేశాడు. ఇప్పటికే ఎనౌన్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇక వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మరి వంశీ ఈ సారి వెబ్ సిరీస్ కోసం ఎలాంటి సబ్జెక్ట్ తీసుకున్నారో చూడాలి.